ఈ మద్య కొంత మంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఇటీవల బిహార్లో దొంగలు రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్ను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బిహార్లో దొంగలు మరోసారి తమ పనితనాన్ని చూపించారు. బాంకా జిల్లా చందన్ బ్లాక్లో దాదాపు ఎనభై అడుగుల ఐరన్ బ్రిడ్జ్ను గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. దీంతో అక్కడ ఇప్పుడు 70 శాతం వంతెన కనిపించకుండా పోయిందని అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవటం గమనార్హం.
శ్రావణి జాతరలో ఝాఝా గ్రామం నుంచి పటనియా ధర్మశాలకు వెళ్లేందుకు ఊరేగింపు పెద్ద వాగులో నుంచి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి. దీంతో అక్కడ వారికి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించుకోవడంతో తాత్కాలికంగా ఒక బ్రిడ్జీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాని పక్కనే పటిష్టంగా మరో బ్రిడ్జీని ఏర్పాటు చేశారు. దీంతో పాత బ్రిడ్జీని ప్రజలు ఉపయోగించకుండా పోయింది. దాంతో కొంత మంది దొంగల కన్ను ఆ వంతెనపై పడింది. ఐరన్ బ్రిడ్జ్ను గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు.
అప్పట్లో ఈ బ్రడ్జీని అత్యవసరంగా నిర్మించాల్సిన పరిస్థితి కావడంతో ఖర్చుకు వెనుకంజ వేయకుండా దాదాపు రూ.46 లక్షలు వెచ్చించారు. అయితే కొత్త వంతెన నిర్మించిన తర్వాత జనాలు ఎక్కువ శాతం ఆ బ్రిడ్జీపైనే రాకపోకలు సాగించడంతో పాత బ్రిడ్జీపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే దొంగలు ఐరన్ బ్రిడ్జ్ను గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. బ్రిడ్జ్ చోరీ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు పోలీసులు.