ప్రేమిస్తున్నానంటూ వెంట పడతారు.. మాటలతో మాయ చేస్తారు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చే సరికి ముఖం చాటేసే యువకులు మన సమాజంలో కోకొల్లలు. అయితే ఈ కాలం అమ్మాయిలు ప్రియుడు మోసం చేస్తే.. మా ఖర్మ అని సరిపెట్టుకోవడం లేదు. ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. తమను మోసం చేసిన వాడికి తగిన రీతిలో బుద్ధి చెప్పి.. మరో యువతి మోస పోకుండా అడ్డుకుంటున్నారు.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వాడు తనను కాదని మరో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకున్న యువతి.. పెళ్లి మంటపానికి వెళ్లి అతగాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. కాబోయే వరుడి మీద పోలీసులుకు ఫిర్యాదు చేసింది పెళ్లి కుమార్తె. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : బస్సు ప్రయాణికులకు ఇక ఆ సమస్య ఉండదు!
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన దుర్గం వినోద్ పదేళ్లుగా చైతన్య అనే యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను కాదని ఇటివల జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మరో యువతి హర్షశ్రీని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ హాల్లో పెళ్లి వేడుకకు సిద్దమయ్యారు.. అయితే.. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియురాలు చైతన్య పెళ్లి జరుగుతున్న మండపం వద్దకు వచ్చింది.
చైతన్యను చూసిన వినోద్ భయంతో బిగుసుకుపోయాడు. గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుండగానే.. చైతన్య బాంబు పేల్చింది. ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేస్తావ్ అని నిలదీసింది. దాంతో పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. నన్ను ప్రేమించాను అన్నావ్.. పెళ్లి చేసుకుంటానని.. ఇప్పుడు మరో యువతిని వివాహం చేసుకుంటున్నావ్ అని నిలదీయడంతో అతగాడి నిజస్వరూపం అందరికి తెలిసింది. ఇక తనను మోసం చేసిన వినోద్పై పెళ్లి కుమారెత హర్ష శ్రీ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.