పిల్లలను ఉన్నత స్థాయిలో ఉండాలని మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల భవిష్యత్ చదువుపైనే ఆధారపడి ఉందని చాలామంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతారు. పిల్లల భవిష్యత్ కోసం కార్పొరేట్ స్కూల్ లో చేరుస్తుంటారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బును వారు తృణప్రాయంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ధారపోస్తున్నారు. అయితే ప్రైవేటు స్కూళ్లలలో ఫీజులకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. నర్సరీ, ఎల్ కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు.
కొన్ని కార్పొరేట్ , ఇంటర్నేషనల్ స్కూళ్లలో అయితే ప్రైమరీ తరగతులకే రూ.లక్ష నుంచిమొదలు రూ.5 లక్షల వరకూ ఫీజు ఉంది. అడిగేవారు లేకపోవడంతో ప్రైమరీ క్లాసులకే బీటెక్ ను మించి ఫీజులు తీసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ల మినహా మెట్రో నగరాల్లోని పలు స్కూళ్లలో ఫీజులు దారుణంగా ఉన్నాయి. అడ్మిషన్, స్పెషల్ ఫీజులను ప్రైవేటు స్కూల్స్ యజమాన్యం ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయని కొంమద . ఇదంతా స్కూళ్ల వైబ్ సైట్లలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదనే కొందరి వాదన.కొన్ని స్కూళ్లు అసలు ఫీజులను తక్కువగా తీసుకొని, డెవలప్మెంట్ ఫంట్ పేరుతో అందినంత దొంచుకుంటున్నారు. డెవలప్మెంట్ ఫండ్కు రశీదులంటూ ఏమీ ఇవ్వడం లేదు. జీవో నెంబర్ 1 ప్రకారం ఐదు శాతం లాభం ఉండేలా ఫీజులను తీసుకోవాలి. కానీ ఈ రూల్ ఏ స్కూల్లోనూ అమలు కావడం లేదు. ఫీజుల డీటెయిల్స్ బోర్డుల మీద పెట్టాలనే నిబంధనలను స్కూళ్లు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు తినే వస్తువులు సహా వేటినీ విద్యా సంస్థల్లో అమ్ద్దని ఆదేశాలున్నాయి.
కానీ, చాలా స్కూళ్లు తమ కాంపౌండ్లోనే అమ్ముతూ పెద్దవ్యాపారమే కొనసాగిస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్, స్టేషనరీ, షూస్, స్పోర్ట్స్ మెటీరియల్.. ఇలా అన్నీ బడుల్లో కొనాల్సిందేనని అంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో కొందరు అప్పులపాలై ఆస్తులమ్ముకుంటున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.