'నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు' అన్నట్లుగా నగరంలో కొన్ని పేరొందిన స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రైమరీ చదువులకే బీటెక్ తరహాలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో నిరుపేద తల్లిదండ్రులు కార్పొరేట్ చదువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలుగు భాష క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. చదువుతో పాటు అన్నింటా ఆంగ్లభాష ఆధిపత్యం పెరగడంతో తెలుగు ప్రాభవం బాగా తగ్గుతోంది. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఈ తరుణంలో ఓ ప్రైవేటు స్కూలులో జరిగిన ఘటన తెలుగు భాషా ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
పిల్లలను ఉన్నత స్థాయిలో ఉండాలని మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల భవిష్యత్ చదువుపైనే ఆధారపడి ఉందని చాలామంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతారు. పిల్లల భవిష్యత్ కోసం కార్పొరేట్ స్కూల్ లో చేరుస్తుంటారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బును వారు తృణప్రాయంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ధారపోస్తున్నారు. అయితే ప్రైవేటు స్కూళ్లలలో ఫీజులకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. నర్సరీ, ఎల్ కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కొన్ని కార్పొరేట్ […]