టెక్నాలజీ డెస్క్- స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ వచ్చేస్తోంది. దీపావళి పండగ సందర్బంగా నవంబరు 4న జియో ఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రేజీ ఫోన్ ధరపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు తెరపడంది. జియో ఫోన్ నెక్స్ట్ ధర 6,499 రూపాయలు. ఐతే 1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను తీసుకోవచ్చు.
జియో ఫోన్ నోక్స్ట్ ధర 3 వేల రూపాయల లోపు ఉంటుందని అంతా అనుకుంటూ వస్తున్నారు. కానీ ఈ పోన్ ధర ఇప్పుడు ఏకంగా దానికి దాదాపు రెట్టింపుగా ఉంది. ముందు 1,999 రూపాయలు చెల్లించిన జియో ఫోన్ నెక్స్ట్ ను తీసుకున్న తరువాత, మిగతా డబ్బులను వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. అందుకోసం 18 నెలలు, లేదా 14 నెలల్లో స్కీమ్ లో నెల నెలా డబ్బులు చెల్లించాలి.
దేశవ్యాప్తంగా రిలయన్స్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో జియో నెక్స్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ప్రకటించింది. ఇక జియో ఫోన్ నెక్స్ట్ ఫీచర్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ తో పనిచేస్తుంది. గూగుల్ భాగస్వామ్యంలో తయారైన ఇందులో క్వాల్ కామ్ చిప్సెట్ ను వినియోగించారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215ను ఉపయోగించి ఉండొచ్చని సమాచారం.
అంతే కాదు వాయిస్ అసిస్టెన్స్, రీడ్ అలౌడ్, ట్రాన్స్ లేట్, 13 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ లైట్ తో కూడిన సెల్ఫీ కెమెరా, ముందే లోడ్ చేసిన గూగుల్, జియో యాప్స్ ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ లో మరో ప్రత్యేక ఫఈచర్ ఏంటంటే.. ట్రాన్స్ లేట్ ఫీచర్ ద్వారా ఏ భాషలో ఉన్న టెక్స్ట్ను అయినా నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు. ఇందులో ఉపయోగించిన ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ను ప్రత్యేకంగా భారతీయులను ఉద్దేశించి డిజైన్ చేశారు. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే జీయో ఫోన్ నెక్స్ట్ ను బుకు చేయండి.