అవినీతిపరులకు సింహస్వప్నంలా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారంలో ఉండి అవినీతి భావజాలానికి తెరలేపిన ఎంతో మంది వ్యక్తిత్వాలను గురించి ప్రజలలో అవగాహన కల్పించిన పవర్ ఫుల్ పోలీస్ గా సుపరిచితమే. ఎల్లప్పుడూ సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ.. ఆయన మోటివేషనల్ స్పీచ్ లతో యువతలో చైతన్యం కల్పిస్తున్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఆధ్వర్యంలో సుమన్ టీవీ ముందుకు తీసుకొస్తున్న సరికొత్త ప్రోగ్రామ్ ‘ఖడ్గం’.
జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని చీల్చేద్దాం, ధర్మ ఖడ్గంతో అధర్మాన్ని అంతం చేద్దాం, శాంతి ఖడ్గంతో అశాంతిని తరిమి కొడదాం.. అంటూ ప్రజలలోకి వెళ్లి వారి సమస్యలపై చర్చించే దిశగా ఖడ్గం ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి సుమన్ టీవీ శ్రీకారం చుట్టిన ఈ సరికొత్త జ్ఞాన ఖడ్గం వేదికగా జనాలతో మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు జేడీ లక్ష్మీనారాయణ. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.