సాధారణంగా ప్రతి మనిషికి డబ్బుల అంటే ఆశ ఉంటుంది. కొందరు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఆస్తులు అమ్మడానికి సిద్ధపడతారు. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే మరొక సందేహం లేకుండా అమ్మేస్తారు. కానీ కొందరు మాత్రం కోట్లులో డబ్బు, వజ్రాలు ఇచ్చిన వారి స్థలాలు అమ్మడానికి ఇష్టపడరు. అచ్చం అలానే తనని ఎందరో బుజ్జగింపులు, బెదిరింపులు చేసిన ఉంటున్న ఇంటిని అమ్మలేదు ఓ వృద్ధురాలు. ఇంతకీ ఆ ఇంటికి ఏంటీ అంత స్పెషాలిటీ? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఎడిత్ మేస్ఫీల్డ్ అనే 84 ఏళ్లు వయసున్న వృద్ధురాలు వాషింగ్టన్లోని సీటెల్లో ఉంటోంది. ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకుంది. భర్తా పిల్లలతో సంతోషంగా గడిపింది. ఆ ఇళ్లు ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. చనిపోయినా కూడా ఆ ఇంట్లోనే అని నిర్ణయించుకుంది. అందుకే పిల్లలతో వెళ్లకుండా అదే ఇంట్లో ఒంటరిగా ఉండటం ఉంటుంది.ఈ క్రమంలో తాను ఉంటున్న ఇంటిని కొని.. దాన్ని కూలగొట్టి మాల్ కట్టాలని కొందరు ప్రాపర్టీ డెవలపర్లు ప్లాన్ చేశారు. వారు ఇళ్లు కూల్చేస్తామని.. డబ్బులు తీసుకుని వేరే చోట కొనుక్కోవాలని బామ్మకు చెప్పారు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ప్రాపర్టీకి ఉన్న విలువకన్నా రెండు రెట్లు ఎక్కువ డబ్బు ఇస్తామన్నారు. అయినా సరే నో చెప్పింది.
చివరికి, ఆ వృద్ధురాలిని బలవంతం చేస్తే స్థానికంగా చెడ పేరు వస్తుందని గ్రహించి వెనక్కి తగ్గారు. వయసు పైబడినా కూడా ఎవ్వరికి బెదరలేదు ఈ బామ్మ. మరొకరి సహాయం తీసుకోకుండా తన పంతాన్ని నెగ్గించుకుంది. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కాపాడుకుంది. ఆమెను స్పూర్తిగా తీసుకోవాలని అంటున్నారు. ఈ బామ్మకు సంబంధించిన ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.