కింగ్ ఆఫ్ పాప్… అద్భుత కళా ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతికొద్దిమంది కళాకారుల్లో మైకేల్ జాక్సన్ ఒకరు. తన అద్భుతమైన సంగీతంతో, డ్యాన్స్తో ప్రపంచ పాప్ అభిమానులకు ఆనందాన్ని పంచేశాడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం త్రిల్లర్. జాక్సన్ పాడటం మొదలు పెట్టింది కేవలం పది సంవత్సరాల వయసులో కావడం విశేషం. తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో అదే పని చేస్తూ వచ్చాడు. మరణించేంత వరకు కూడా సంగీతమే ఆయువుగా బతికాడు. పేదరికంలో పుట్టిన జాక్సన్ మరణించే నాటికి మాత్రం ఎంతో డబ్బు కలిగి ఉన్నాడు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు- పేదరికంలో చావడంలో మాత్ర కచ్చితంగా తప్పే అంటూ ఆయన తరుచూ తన సన్నిహితుల వద్ద అనేవారట.జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేయడం గమనార్హం.
11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు. అదే జాక్సన్ చివరి ఆల్బం కూడా. జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడు పోయినట్లు ఓ అంచనా. పాటలు పడుతూనే అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకున్న మొదటి సింగర్ మైఖేల్ జాక్సన్ ఈరోజుకి మరణించిన రోజు. మైకేల్ జాక్సన్ తుది శ్వాస వదిలి 11 సంవత్సరాలు అవుతుంది.
జాక్సన్ 1988 నుంచి 2005 వరకు జాక్సన్ తన నెవెర్లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు.ఆయన అభిమనుల గుండెల్లో ఇంకా బ్రతికే వున్నారు. మైఖేల్ అభిమానులు నిత్యం ఆయన పాటలు వింటూ ప్రతి రోజు ఆయనను స్మరించుకుంటుంటారు. నేడు వర్థంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు.