విపరీతమైన వేడిగాలులు, కరువు మరియు వరదలు., కేవలం ఒక దశాబ్దంలో ఉష్ణోగ్రత పరిమితి విచ్ఛిన్నం అవుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ (Inter-governmental Panel on Climate Change – IPCC) హెచ్చరించింది. తాజా వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ప్రభుత్వ ప్యానెల్ నివేదిక ప్రకారం వాతావరణ మార్పు విస్తృతంగా, వేగంగా తీవ్రతరం అవుతోంది. సునామీకి కూడా దారి తీసే అవకాశం ఉందా? వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం దేశంలోని 12 సిటీలు భవిష్యత్లో కనిపించకుండా పోతాయట. ఏపీని చినుకు వణుకు పుట్టిస్తుంది.
భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక గోదావరికి వరద పోటెత్తడంతో ఉభయగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో తీరంలోని రెండు షాపులు ధ్వంసమయ్యాయి. ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రపు కెరటాలు స్థానిక భవనాలను తాకుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
1969 నవంబరులో సంభవించిన తుపాన్ ఉప్పాడ గ్రామంలో విధ్వంసం సృష్టించింది. 18గంటలు కొనసాగిన తుపాను ప్రభావం వల్ల గ్రామాలకు గ్రామాలు సముద్రంలో కలిసిపోయాయి. పల్లిపేట,సుబ్బంపేట తీరప్రాంతాల్లో ఒక్క గుడిసె కూడా మిగలకపోడంతో మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏపీలో పలు చోట్ల సముద్రం తీరంలో జరిగే మార్పులు భయాందోళన కలిగిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో తూర్పుతీరంలో అలజడి మొదలవ్వడంతో అసలు ఏం జరుగు తుందో ఎవ్వరికి తెలియడం లేదు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదితో పాటు కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రంలో జరిగిన మార్పులు మరోప్రక్క సముద్రంలో భుప్రకంపనలు తీరప్రాంత వాసులను కలవర పెడుతున్నాయి.