అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక తేదీలను ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విధ్యార్ధులకు సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. కరోనా కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారని అన్నారు. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
వాస్తవానికి ఈనెల 5 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఐతే ప్రస్తుతం కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్న నేపధ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్దులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.