హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ టెలీకాం కంపెనీల నుంచి నెట్వర్క్ సమస్యతో ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక ఈ సమస్యకు మార్గాన్ని చూపించింది తెలంగాణ సర్కార్. నగరం నలుమూలలికి ఎక్కడికి వెళ్లినా వైఫై అందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీంతో ఎట్టకేలకు హైదరాబాద్ వాసులకు శుభవార్త అందెలా ప్రీ వైఫై సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇక నగరంలో ఆగస్టు 4 న కొత్త హాట్స్పాట్ సెంటర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ సర్కారు చేపట్టిన హై-ఫై ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త సదుపాయం నగర వాసులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ప్రభుత్వ సహాకారంతో ప్రముఖ ఇంటర్నెట్ ప్రొవైడర్ యాక్ట్ ACT నగరంలో మూడు వేల హాట్స్పాట్లను అందుబాటులోకి తేనుందని సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సైతం జరుగుతున్నాయట.
ఈ వార్తతో కాస్త వైఫై ఇబ్బందులు తీరునున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఈ సెంటర్ల వద్ద ఎవరైనా సరే ఐదు ఎంబీబీఎస్ స్పీడ్ తో అరగంట పాటు వైఫై సేవలను పొందే వీలును కల్పించనుంది ప్రభుత్వం. దీంతో వ్యాపారుల, విద్యార్థులు, పర్యాటకుల నెట్వర్క్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.