మనుషుల్లో రోజు రోజుకి మానవత్వం నశిస్తుంది అని చెప్పడానికి మరో ఉదాహహరణ కళ్లెదుటే కనబడింది. ఒక డ్రైవర్ చేసిన నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి కావాల్సి వచ్చింది.
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ తగ్గిపోతూ వస్తుంది. కమర్షియల్ గా ఆలోచిస్తూ పక్క వారికి కనీస సహాయం కూడా చేయలేకపోతున్నారు. అన్నిటినీ డబ్బే శాసిస్తున్న ఈ కాలంలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యానికి అమయాక ప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు(40) వాంతులు విరోచనాలతో మూడు రోజుల క్రితం బాన్సువాడ హాస్పిటల్ లో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలు కి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. పరిస్థితి విషమం కావడంతో విధుల్లో ఉన్న ఆఫీసర్ తన తండ్రిని నిజామాబాద్ హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్సు డ్రైవర్ కి ఫోన్ చేసి అంబులెన్సు తీసుకురావాల్సిందిగా సూచించాడు.
అయితే ఇక్కడే డ్రైవర్ చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. కాస్త జాలి, దయ లేకుండానే ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. సాయిలు తన తండ్రిని నిజామాబాద్ కి తీసుకెళ్లాల్సిందిగా ప్రాధేపడ్డాడు. అయితే డ్రైవర్ మాత్రం అంబులెన్సు లో డీజిల్ లేదని 800 రూపాయలు ఇస్తేనే తీసుకెళ్తానని క్రూరంగా ప్రవర్తించాడు. అదే సమయానికి సాయిలు కొడుకు దగ్గర కేవలం 50 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో ఆ డ్రైవర్ సాయిలు తండ్రిని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. కొద్ది సేపటివరకు వేచి చూసిన డ్రైవర్.. డబ్బులు ఇవ్వకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. డ్రైవర్ అక్కడ నుంచి వెళ్లిపోయిన కాసేపటికే సాయిలు తండ్రి ప్రాణం విడిచాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకురాలు హాస్పిటల్ ఎదుట రహదాహరిపై రాస్తారోకో చెప్పుతారు. కాంగ్రెస్ నాయకులూ కూడా ఇందులో పాల్గొన్నారు. సాయి మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది, డ్రైవర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన సీఐ మహేందర్ రెడ్డి అక్కడకి వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసనను విరమించుకున్నారు. 800 రూపాయల కోసం ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం నిజంగా చాలా విచారకరం. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారు మీద గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకుంటేనే వీటిని ఈ దారుణాలను ఆపగలం.