కత్తి మహేశ్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అందరూ ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు వైద్యుల సూచన మేరకు ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కత్తిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.., కత్తి మహేశ్ ఎడమ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని, వైద్యులు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించి ఆయన మేనమావకి తెలియచేశారన్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే కత్తి మహేశ్ కి ఈస్థాయిలో గాయాలు అయ్యాయి. ఇంకా కూడా ఆయన వెంటిలేటర్ పై ఉండే చికిత్స అందుకుంటున్నారు. కానీ.., ఈ లోపే కత్తి మహేశ్ కంటి చూపు పోయిందని కొంత మంది, లేదు కేవలం ఎడమ కన్ను మాత్రమే చూపు కోల్పోయిందని కొంత మంది వార్తలు పుట్టించేస్తున్నారు. నిజానికి కత్తి మహేశ్ కి రెండు కళ్ళలో తీవ్రమైన గాయాలు అయిన మాట వాస్తవమే. కానీ.. కుడి కన్నుకి ఎలాంటి ప్రమాదం లేదు.
ఎడమ కన్నుకి మాత్రం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ ఆపరేషన్ చేసినా.., ఆ కంటికి చూపు వచ్చే అవకాశాలు తక్కువే అని కత్తి బంధువులకి చెన్నై డాక్టర్స్ ఇప్పటికే తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.., యాక్సిడెంట్ అయిన సమయంలో బ్రెయిన్ లో రక్త స్రావం జరగకపోవడం అనేది చాలా మంచిదైందని, కాబట్టి.. కత్తి మహేశ్ ప్రాణానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియచేసినట్టు తెలుస్తోంది. ఇక కత్తి మహేశ్ వైద్య ఖర్చులకు ఇప్పటి వరకు ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా సహాయంగా తీసుకోలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలియచేశారు.