వరంగల్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చాలా గంబీరంగా మట్లాడతారు. కాని కొన్ని సందర్బాల్లో మాత్రం భలే సరదాగా ఉంటారు. ఎంత పెద్ద సమస్యనైనా చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని పరిష్కరించే వరకు వదిలిపెట్టరు సీఎం కేసీఆర్. ఇప్పుడు కరోనా ధర్డ్ వేవ్ పైన కూడా కేసీఆర్ చాలా సింపుల్ గా మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. ప్రత్యేకంగా మన భారత దేశంలో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో, అదే సమయంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కరోనా ధర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్పై వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. కరోనా దాదాపు తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక ధర్డ్ వేవ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లో.. స్కూళ్లు లేక ఇళ్లన్నీ అంగడంగడి చేస్తున్నారు పిల్లలు.. వాళ్లకు కరోనా వస్తుందన్న పుకార్లు పుట్టాయి.. వీనికి ఫోన్ చేసి చెప్పిందా.. ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని.. ఎట్ల పుట్టించినరంటే.. ఇప్పటికే పుస్తలతాళ్లు అమ్ముకుని లక్షలు కుమ్మరించారు జనం.. దండం పెట్టి చెబుతున్నా… పుకార్లు మానండి.. మాస్కు పెట్టుకోమని చెప్పండి.. అంతేకాని భయపెట్టకండి.. నాకొచ్చి పాడైంది కరోనా… చెబితే పంచాయతీ.. డాక్టర్ని అడిగినా.. బీమార్ ఏందో దొరికిందా అని.. ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్పారు..
అసలే నాది బక్కప్రాణం ఇష్టమొచ్చిన గోలీలు వేయకండని చెప్పా.. రెండే రెండు గోలీలు వేసుకున్నాను.. ఏదన్నా ఒకటి యాంటీ బయాటిక్ ట్యాబ్లట్ వేసుకోమన్నారు.. అదీ వారానికి ఒకటి వేసుకోవాలి అన్నారు.. కానీ నేను వేసుకోలేదు.. దీనికి ఇన్ని కథలా.. ఇన్ని ప్రచారాలా.. ఇన్ని భయోత్పాతాలా.. దయచేసి మీడియా వాళ్లు ఇది గుర్తించాలి.. ప్రజల బతుకులతో ఆడుకోవడం సరికాదు.. అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలోనే విద్యా సంస్థలను జులై 1 నుంచి ప్రారంభిస్తున్నామని, పిల్లలను స్కూళ్లకు పంపితే బాగా చదువుకుంటారని కేసీఆర్ చెప్పారు.