ఇటీవల కాలంలో అనేక మంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. షూటింగ్ సమయంలో ఇటీవల వరుణ్ సందేశ్కు గాయాలయ్యాయి.
ఇటీవల కాలంలో అనేక మంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. షూటింగ్ సమయంలో నటుడు వరుణ్ సందేశ్కు గాయాలయ్యాయి. అలాగే టాలీవుడ్ టాప్ నటి కళ్యాణి ప్రియదర్శిని కూడా గాయపడిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భార్య భారతి.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సన్మానించారు. ఆ సమయంలో భారతి చేతికి కట్టుకట్టుకుని కనిపించారు. దీంతో భారతికి ఏమైందా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే చెయ్యి బెణకడం వల్లే ఆమె కట్టు కట్టుకున్నారని సమాచారం. ఇప్పుడు మరో నటి ఆసుపత్రి పాలైంది.
సినీ నటి, కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బు సుందర్ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల వరుసగా పలు వ్యాఖ్యలతో లైమ్ లైట్లోకి వచ్చిన ఆమె.. ఆసుపత్రి బెడ్ పై కనిపించారు. అయితే కోకిన్స్ బోన్(టెయిల్ బోన్) చికిత్స కోసం ఆమె ఆసుపత్రికి వచ్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ నా కోకిక్స్ ఎముక చికిత్స కోసం మళ్లీ ప్రక్రియ మొదలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పూర్తిగా నయమవుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేయగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకుని రావాలని కామెంట్స్ చేస్తున్నారు.
On the road to recovery! Underwent a procedure for my coccyx bone ( tail bone ) yet again. Hope it heals completely. 🙏 pic.twitter.com/07GlQxobOI
— KhushbuSundar (@khushsundar) June 23, 2023