తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో జబర్ధస్త్, ఢీ డ్యాన్స్ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్గా ఉన్న ఎంతోమందికి ఢీ డ్యాన్స్ షో ఎంతో ఉపయోగపడింది. తాజాగా ‘ఢీ’ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. వ్యక్తిగతంగా యంగ్ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్కిది తీరని లోటు అనే చెప్పాలి. ఎందుకుంటే ‘ఢీ’ లో యశ్ మాస్టర్ టీంలో కంటెస్టంట్గా అలాగే కొద్ది కాలం యశ్ మాస్టర్ అసిస్టెంట్గా కూడా పని చేసిన కేవల్ కన్నుమూశాడు.
గత కొద్ది కాలంగా కేవల్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడిని బతికించడానికి అవసరమైన బ్లడ్ అందిచండి.. అందరూ సాయం చెయ్యండని యశ్తో ‘ఢీ’ కంటెస్టంట్స్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన వైద్యం అందక ఆరోగ్యం విషమించడంతో కేవల్ కన్నుమూశాడు. ఇతడిని బతికించడానికి యశ్ మాస్టర్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు.. కానీ అన్నీ వృధా అయ్యాయి. ఢీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి, పూర్ణ సహా ఇంకా చాలామంది సోషల్ మీడియాలో కేవల్ కి సహాయం చేయమని కోరారు.. వాళ్లకు తోచిన సహాయం కూడా చేశారు. ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బ్లడ్ క్యాన్సర్తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కంటెస్టెంట్ కేవల్ తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 19న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
దాంతో యశ్ మాస్టర్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. “నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నాను… ఈ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నువ్వు ఉన్నట్టుగానే అనిపిస్తోంది.. మమ్మల్ని అందరిని ఒంటరి చేసి ఎంతో త్వరగా వెళ్లిపోయావ్” అంటూ యశ్ మాస్టర్ చేసిన పోస్ట్ అందరిని కంటతడి పెట్టిస్తుంది.