నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో ఇప్పుడు దేశంలోనే టాప్ రేటింగ్ తో దూసుకపోతుంది. ముఖ్యంగా బాలయ్య అన్ స్టాపబుల్ ఎనర్జీ ఈ షోకి ప్రధాన బలమైంది. అన్ స్టాపబుల్ షోకు మంచు వారి ఫ్యామిలీ, కామెడి కింగ్ బ్రహ్మానందం, మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి వంటి మరికొందరు ప్రముఖులు అతిథులుగా హాజరై.. ఎన్నో విషయాలను షోలో పంచుకున్నారు.
ఇది కూడా చదవండి:
అన్ స్టాపబుల్-2 హోస్ట్ పై క్లారిటీ ఇచ్చిన బీవీయస్ రవి!
నిజానికి ఆహా అంటే మెగా కాంపౌండ్ కి చెందిన ఓటీటీ. అల్లు అరవింద్ తలుచుకుంటే ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవితో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటి ఈ షోకు కనీసం గెస్ట్ గా సైతం చిరంజీవి హాజరు కాలేదు. దీంతో చిరంజీవి బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రచయిత బి.వి.యస్. రవి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
“మెగాస్టార్ ఈ షోకు రావడానికి ఆసక్తి చూపించారు. కానీ.., డేట్లు అడ్జెస్ట్ కాలేదు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ వీరిద్దరితో ప్రారంభమైయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా జరిగాయి. చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల షూటింగ్ లు, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నారు. అన్ స్టాపబుల్ సీజన్-2 కు ఆయన తప్పకుండా వస్తారు” అని రచయత బి.వి.యస్ రవి తెలియచేశాడు. ప్రస్తుతం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అన్ స్టాపబుల్ వేదికగా బాలయ్య-చిరు కలిస్తే ఎలా ఉంటుంది? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.