నందమూరి బాలకృష్ణ.. ఈసారి సంక్రాంతికి మాస్ మేనియా చూపిస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షన్ జానర్ లో ‘వీరసింహారెడ్డి’ చేసిన ఆయన.. ఏకంగా తొలిరోజు రూ.54 కోట్ల గ్రాస్ సాధించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది బాలయ్య కెరీర్ లో అత్యధికం. తన గత చిత్రాల రికార్డులన్నింటినీ బాలయ్య చెరిపేశారు. అలానే రెండో రోజు కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ రియాలిటీలో జరిగింది వేరేలా కనిపిస్తుంది.
ఇక విషయానికొస్తే.. బాలయ్య హీరోగా చేసిన ‘వీరసింహారెడ్డి’ తొలిరోజు అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.25 కోట్లపైనే షేర్ సాధించినట్లు తెలుస్తోంది. మిగతా అన్ని చోట్ల కలిపి రూ.54 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. అయితే రెండో రోజు వచ్చేసరికి థియేటర్లలోకి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వచ్చేసింది. ఈ మూవీ ఎఫెక్ట్.. బాలకృష్ణ సినిమాపై పడినట్లు తెలుస్తోంది. దీంతో 70 శాతానికి పైగా కలెక్షన్స్ పడిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో రెండో రోజు తెలుగు స్టేట్స్ లో కేవలం రూ.5 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం.
మరోవైపు చిరు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వరల్డ్ వైడ్ గా తొలిరోజు రూ.55 కోట్లపైన గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ లో చిరు-బాలయ్య మధ్య చిన్నపాటి తేడా ఉన్నప్పటికీ.. రెండో రోజు వసూళ్లలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉండేలా కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. ‘వీరసింహారెడ్డి’కి రెండు రోజులకు కలిపి రూ.65 కోట్లకు పైనే గ్రాస్ సంపాదించినట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ సీన్స్, డైలాగ్స్ మెయిన్ హైలెట్ గా నిలిచాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ‘వీరసింహారెడ్డి’ రెండు రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.