మెగా కోడలు ఉపాసన.. ప్రస్తుతం మాతృత్వ మధురిమలు ఏంజాయ్ చేస్తున్నారు. ఉపాసన-రామ్ చరణ్ల వివాహం అయ్యి పదేళ్లకు పైగానే అవుతోంది. కానీ ఇప్పటి వరకు వారికి సంతానం కలగలేదు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మెగా కుటుంబంలోకి వారసుడో.. వారసురాలో రాబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఉపాసన తాను ప్రెగ్నెంట్ అనే విషయం వెల్లడించింది. ఈ వార్త కొణిదెల, కామినేని కుటుంబాలతో పాటు.. మెగా అభిమానుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేసింది. ఇక ఇదే సందర్భంలో రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ వార్త చెప్పిన దగ్గర నుంచి.. అన్ని శుభవార్తలు వింటూ.. సంతోషంగా గడుపుతున్న సమయంలో.. ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాసన గ్రాండ్ మదర్ పుష్నాని మృతి చెందారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఉపాసన. గ్రాండ్ మదర్తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోషన్ పోస్ట్ చేసింది ఉపాసన. ‘‘కడవరకు.. కృతజ్ఞత, ప్రేమ, గౌరవం, సహానుభూతితో తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె జీవితం నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. పుష్నాని నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె పంచిన ప్రేమను నేను ఎన్నటికి మరువలేను. నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభూతులన్నింటిని నా పిల్లలకు అందేలా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది.