‘జబర్దస్త్’ పేరు చెప్పగానే చాలామందికి కామెడీ స్కిట్లు, పంచులే గుర్తొస్తాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తదితరులు చేసిన స్కిట్స్ మన కళ్లముందు మెదులుతాయి. కానీ అందులో చేసి టీమ్ లీడర్స్, వాళ్లు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్.. సదరు వ్యక్తులు చెబితే గానీ బయటకు రావు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే ధనరాజ్ బయటపెట్టారు. ఆలోచన లేకుండా అప్పట్లో కొన్ని తప్పులు చేశానని అన్నారు.ఇక వివరాల్లోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరి తొలివారంలో ‘జబర్దస్త్’ షో మొదలైంది. తెలుగు టీవీపై అంతకు ముందు కొన్నికొన్ని కామెడీ షోలు వచ్చాయి గానీ ఇది మాత్రం వాటన్నింటి కంటే డిఫరెంట్.
‘జబర్దస్త్’ షోలో ఇద్దరు జడ్జిలు, ఆరుగురు టీమ్ లీడర్స్, వాళ్లు చేసే స్కిట్స్, చివర్లో టీమ్ లీడర్స్ అందరికీ ఓ గేమ్. ఓ ఎపిసోడ్ ఇలా ఉండేది. ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు దీన్ని ప్రసారం చేసేవారు. ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్ కి అప్పట్లో బాగా ఎక్కేసింది. ఎంతలా అంటే అప్పుడు మొదలైన ‘జబర్దస్త్’ మేనియా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రారంభంలో చంటి, ధనరాజ్, వేణు, రాఘవ లాంటి వాళ్లు ఉండేవారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ టీమ్ లీడర్స్ చాలామంది వెళ్లిపోయారు. అలాంటి వారిలో ధనరాజ్ కూడా ఒకరు. తను అసలు షో ఎందుకు మానేయాల్సి వచ్చిందో ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
‘జబర్దస్త్’లో చేస్తున్న సమయంలోనే ఓ రోజు వేణు వచ్చి.. మరో ఛానెల్ లో మనిద్దరికీ యాంకర్స్ గా ఓ ప్రోగ్రామ్ లో అవకాశమొచ్చిందని చెప్పాడు. ‘ఇక్కడ కమెడియన్స్ గా చేస్తున్నాం, యాంకర్స్ గా పర్వాలేదా’ అని వేణుని అడిగితే.. ‘ఏం కాదు చేద్దాం’ అని హామీ ఇచ్చాడు. అలా ఓ 13 ఎపిసోడ్స్ ఆ ఛానెల్ లో చేశామని ధనరాజ్ చెప్పాడు. ఆ సమయంలో ‘జబర్దస్త్’లో సుడిగాలి సుధీర్, రాకేశ్-ఆర్పీ టీమ్స్ ఏర్పడ్డాయని అన్నాడు. దీంతో మళ్లీ వెనక్కి వెళ్తే, కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుందని, అందుకే షోలోకి తిరిగి అడుగుపెట్టలేదని ధనరాజ్ చెప్పాడు. ‘జబర్దస్త్’ మానేసి మాత్రం తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మరి ‘జబర్దస్త్’పై ధనరాజ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:సుడిగాలి సుధీర్ కి అవసరమా? వాడు చాలా మారాలి! ధనరాజ్ షాకింగ్ కామెంట్స్!