డబ్బు, హోదా కోసం సినిమా పరిశ్రమలోకి వస్తుంటారు. అందమైన రంగుల ప్రపంచంలో అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటే పొరపాటు. కష్టపడే మనస్తత్వంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కావాలి. మంచి సినిమాలో నటించి.. పేరొస్తేనే నటీనటులుగా పరిశ్రమలో కొనసాగగలరు
డబ్బు, హోదా, ఫేమ్ కోసం సినిమా పరిశ్రమలోకి వస్తుంటారు. అందమైన రంగుల ప్రపంచంలో అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటే పొరపాటు. కష్టపడే మనస్తత్వంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కావాలి. పేరొస్తేనే నటీనటులుగా పరిశ్రమలో కొనసాగగలరు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాల్సిందే. ఇల్లు ఉండగానే చక్కబెట్టుకోవాలన్న చందంగా.. ఆ సంపాదనతో ఇళ్లు, పొలాలు, స్థలాలు, పెట్టుబడులు పెడుతుంటారు. అయితే కొన్ని సార్లు వీరు కూడా మోసానికి గురౌతుంటారు. నిలదీస్తే సెలబ్రిటీలు అని చూడకుండా దాడి చేస్తుంటారు. తాజాగా ఓ నటిపై పలువురు దాడి చేశారు.
శాండల్ వుడ్ నటి అను గౌడపై దాడి జరిగింది. భూవివాదానికి సంబంధించిన ఆమెపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. నీలమ్మ, మోహన్ అనే వ్యక్తులు సాగర్ తాలూకాలోని కస్పాడి గ్రామంలో అనును తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. ఈ విషయమైన సాగర్ తాలూకా ఆనందపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అనుగౌడ స్వస్థలం శివమొగ్గ (షిమోగా) జిల్లాలోని హోస్ నగర్. అయితే సాగర్ తాలూకాలోని కస్పాడిలో భూమి ఉంది. ఇందులో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. ఆమె తరచూ బెంగళూరు నుండి ఇక్కడకు వస్తూ వెళుతుండేది
ఈ భూమిపైనా వివాదం నడుస్తూ ఉంది. ఈ భూమి తమదంటూ ఆమెతో కొందరు గొడవపడుతున్నారు. అయితే ఇటీవల ఆమె కస్పాడి వెళ్లగా.. ఆమెపై స్థానికులైన నీలమ్మ, మోహన్ దాడి చేసి గాయపరిచారు. ఆమె తలకు గాయమవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుగౌడ కన్నడ సినిమాలు, సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. తమిళంలో మౌనమా నీరమ్, కలకల్, శంకర వంటి చిత్రాల్లో నటించింది. కన్నడలో సుదీప్ తో కెంపెగౌడ, విష్ణువర్థన్తో స్కూల్ మాస్టర్, శివ రాజ్ కుమార్ సుగ్రీవ, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ బాయ్స్లో మెరిసింది.