Vishal, Karthi: తమిళ స్టార్ హీరోలు విశాల్, కార్తీలను చంపుతామని బెదిరించినట్లు వచ్చిన వార్తలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. విశాల్, కార్తీలను చంపేస్తామని కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజాదురై హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు నడిఘర్ సంఘం అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలు కోలీవుడ్ లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా నటుడు నాజర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
నాజర్ నేతృత్వంలో సభ్యులుగా ఉన్నటువంటి హీరోలు విశాల్, కార్తీ నడిఘర్ సంఘం అభివృద్ధికోసం అన్నివిధాలా సహకరిస్తున్నారు. సినీ కార్మికుల కష్టాలకు ముందుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో విశాల్, కార్తీలపై ద్వేషం పెంచుకున్న నటుడు రాజాదురై.. హీరోలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూనే, వారిని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ధర్మరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అదీగాక సోషల్ మీడియాలో విశాల్, కార్తీలపై అవమానకర పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని.. ఎలాగైనా విశాల్, కార్తీలకు పోలీసులు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు ధర్మరాజ్. ఇక ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విశాల్ లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు కార్తీ సర్దార్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Death Threats to Vishal, Nasser & Karthi | Nadigar Sangam | Tamil Cinema
Video link: https://t.co/n9gKKy3eis#Vishal #Nasser #Karthi #NadigarSangam #TamilCinema #Cineulagam pic.twitter.com/tZjWncc3WP
— Cineulagam (@cineulagam) July 6, 2022