తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ ప్రణతి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన నివాసంలో మెగాస్టార్ దంపతులతో కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో ఈ షో పిచ్చపాపులారిటీ తెచ్చుకుంది. ఓ రెండు సీజన్లలో తెలుగు సింగర్లు కప్పును గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ షో తెలుగులోనూ మొదలైంది. ‘తెలుగు ఇండియన్ ఐడల్’గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఈ షో నడుస్తోంది. ఎంతో మంది ఔత్సాహిక సింగర్లు ఈ షో ద్వారా తమ సత్తా చాటుతున్నారు. తమ ప్రతిభను నలుగురికీ తెలిసేలా చేసుకుంటున్నారు. అలా తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా సింగర్గా పేరు తెచ్చుకున్న వారిలో ప్రణతి ఒకరు. తన అద్భుతమైన గాత్రంతో జడ్జీలతో పాటు ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకున్నారు ప్రణతి.
తన ప్రతిభతో సినీ పరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించారు. తాజాగా, ప్రణతి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆమె మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్కడ చిరంజీవి దంపతులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు ప్రణతితో కొన్ని పాటలు పాడించుకుని విన్నారు. ఆమె గాత్రానికి మైమరచిపోయారు. అనంతరం బాలికను చిరంజీవి ఆశీర్వదించారు. భవిష్యత్తుల్లో మంచి సింగర్గా రానించాలని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి, తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ ప్రణతి మెగాస్టార్ చిరంజీవిని కలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.