ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన సోషల్మీడియా ద్వారా ప్రకటించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి’ అని ట్వీట్ చేసింది.
దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తనకు కరోనా అంటూ చేసిన పోస్ట్పై తమదైన శైలిలో విభిన్న కామెంట్స్ తో స్పందిస్తున్నారు. ‘మంచి న్యూస్ చెప్పావు. ‘2022లో బెస్ట్ న్యూస్ ఇదే, కరోనా వచ్చిందా? అయిదే చచ్చిపో.. అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు స్పందించిన పోస్ట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.