కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతోంది. దీని కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఇప్పటికీ సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరి జీవితాలతో ఆటలు ఆడుతోంది ఈ మహమ్మారి. ఇందుకు సినిమా సెలబ్రెటీలు కూడా అతీతం కాదు. తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట్లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది.
సుధీర్ అమ్మమ్మ కరోనా కారణంగా ప్రాణాలు విడిచారట. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ షాక్ కి గురి అవుతున్నారు. నిజానికి ఈ విషయాన్ని సుధీర్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు రాం ప్రసాద్ ఓ షోలో వెల్లడించాడు. అమ్మమ్మ చనిపోయినా.., సుధీర్ వెల్లలేకపోయాడని.. చివరి చూపులు కూడా దక్కలేదని రాం ప్రసాద్ ఫ్యాన్స్ కి తెలిపాడు. ఆ సమయంలో అతని పక్కనే ఉన్న సుధీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తనని చిన్నప్పటి నుండి పెంచి.., పెద్ద చేసిన అమ్మమ్మ చనిపోతే చివరి చూపుకి కూడా నోచుకోలేకపోయాను అని.., ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్ లో ఉన్నా.., ఆమె అనాధ శవంలా వెళ్లిపోవాల్సి వచ్చిందని సుధీర్ తన బాధని తెలియచేశాడు. ఎప్పుడు నవ్వుతు, అందరిని నవ్వించే సుధీర్ ఇలా ఏడ్చేయడంతో సుధీర్ ఫ్యాన్స్ కూడా షాక్ కి గురి అవుతున్నారు.
నిజానికి కరోనా సినీ పరిశ్రమాలో చాలా కుటుంబాలను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఐకాన్ స్టార్ బన్నీ మొన్నటికి మొన్న కరోనాకి గురి అయ్యి.., మళ్ళీ ఆరోగ్యంగా తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఇక యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స అందుకుంటున్నాడు. ఇక వీరే కాక టాలీవుడ్ నటులు, దర్శకులు, రచయితలు ఇలా చాలా మంది ఈ మహమ్మారి దెబ్బకి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏదేమైనా.. బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ ఫస్ట్ టైమ్ ఇలా కెమెరా ముందు ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళనకి గురి అవుతున్నారు. సుధీర్ ఈ కష్టం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.