ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా? మీకోసమే ఈ చల్లటి వార్త. రాబోయే రోజుల్లో మీ ఏరియాలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇంతకీ సంగతేంటో తెలియాలా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలామంది పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వెళ్లి వడదెబ్బలు తగిలి అనారోగ్యం పాలవుతున్నారు. కూల్ డ్రింక్స్, మజ్జిగ లాంటివి తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వీలైనంత వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి టైంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వానలు విస్తారంగా పడుతుండగా.. కొన్నిచోట్ల ఎండలు మండిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా జూపల్లిలో, మంచిర్యాల జిల్లా జిన్నారంలో తాజాగా 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హనుమకొండ, జగిత్యాల, కొమురంభీం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పలుప్రాంతాల్లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ 36.2 డిగ్రీల నుంచి 41.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజాగా హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ.. బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొననుంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుందని అన్నారు. దీనికి పశ్చిమ విదర్భ నుండి మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక, దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉండడమే ముఖ్య కారణమని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మరో మూడు రోజులపాటు 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అన్నారు. మరి రాబోయే రెండు రోజుల వర్షాలు పడతాయని అంటున్నారు? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.