దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ట్రిపులార్ సాధించిన భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓల్వో కంపెనీకి చెందిన ఎక్స్ సీ40 అనే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ఓల్వో కంపెనీ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. రాజమౌళికి కారు కీస్ అందజేస్తూ ఉన్న ఫొటోను ఓల్వోకార్స్ ఇన్ అనే వారి అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘గొప్ప దర్శకుడు, కథా రచయిత అయిన దర్శకుడు రాజమౌళిని వోల్వో కార్స్ ఇండియా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజమౌళి దార్శనికత లాగే ఆయన ప్రయాణాలు కూడా ఎంతో గొప్పగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగాలని కోరుకుంటున్నాం’ అంటూ వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి కార్ ను అందజేస్తూ ఉన్న ఫొటోని షేర్ చేశారు.
ఇదీ చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?
రాజమౌళి కొనుగోలు చేసిన ఈ కారు హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర 44.50 లక్షలు కాగా.. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 53 లక్షలు వరకు ఉంటుంది. జక్కన ఫ్యూజన్ రెడ్ కలర్ వోల్వో ఎక్స్ సీ40 కారు కొనుగోలు చేశారు. ఈ కారు ప్రత్యేకతలు ఏంటంటే.. ఇది 1969 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. పనోరమిక్ సన్ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇంకసినిమాల విషయానికి వస్తే రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై ఇంకా ఎలాంటి అప్టేడ్స్, ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించలేదు. రాజమౌళి కొన్న కొత్త లగ్జరీ కారు ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.