నటుడు సోనూ సూద్ హైదరాబాద్ లో సందడి చేశారు. కొండాపూర్ లోని ఓ ప్రముఖ మండి రెస్టారెంట్ కు వచ్చిన ఆయన భారతదేశంలోనే అతి పెద్ద మండి ప్లేట్ ను ప్రారంభించారు.
ప్రముఖ నటుడు సోనూ సూద్ కు దేశ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోనూ సూద్ నటుడిగానే కాకుండా మంచి మానవతా దృక్పథం కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. అటు సినిమాల్లో నటిస్తూనే, ఇటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా టైమ్ లో సోనూ సూద్ చేసిన సేవల గురించి ఎంతో మంది ప్రశంసించారు. ఆ సమయంలో చాలా మందికి సాయం చేసి దేవుడిలా ఆదుకున్నారు. దీంతో అప్పటి నుంచి సోనూ సూద్ కు మరింత ఎక్కువ మంది అభిమానులయ్యారు.
ఇదిలా ఉంటే సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ లో సందడి చేశారు. కొండాపూర్ లో ఉన్న జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సోనూ సూద్ మండి ప్లుట్ ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ మండి ప్లేట్ ప్రారంభ వేడుకకు నటి హిమజ, ఇన్ స్టాగ్రామ్ పద్దు పద్మావతితో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరం. ముఖ్యంగా ఇక్కడ అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి.
అయితే ఇండియాలోనే అతి పెద్ద మండి ప్లేట్ (సోనూ సూద్ మండి ప్లేట్) ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ మండి ప్లేట్ అనేది ఎవరూ ఊహించని రీతిలో ఉందని ఆయన తెలిపారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ సోనూ సూద్ మండి ప్లేట్ 8 అడుగులు ఉంటుందని, ఈ ప్లేట్ లో ఏకంగా 20 మందికిపైగా తినొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ అతి పెద్ద మండి మా అన్ని బ్రాంచిల్లో అందుబాటులో ఉంటుందని అన్నారు. అయితే కొండాపూర్ లోని జిస్మత్ అరబిక్ రెస్టారెంట్ కు నటుడు సోనూ సూద్ వస్తున్న విషయం తెలుసుకున్న సోనూ సూద్ అభిమానులు చాలా మంది వచ్చారు. ఇక ఆయనను కలుసుకుని సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు.