టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తను చేసి డ్యాన్స్ వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ పాటకు లంగావోణి ధరించి స్టెప్పులేసింది.
సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో, సామాజిక సేవలతో అశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ఎంతో మంది తల్లి దండ్రుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎక్కువగా పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తారు. తన గారాల పట్టి సితార అంటే ఎంత ప్రేమో చెప్పాల్సిన పని లేదు. సితార సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, కుటుంబానికి సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది.
తండ్రికి తగ్గ తనయగా సితార ఇటీవలి కాలంలో ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఆ సంస్థకు సంబంధించిన యాడ్ షూటింగ్ లో పాల్గొన్నది. కొంత కాలం నుంచి ఓ డ్యాన్స్ మాస్టర్ సమక్షంలో డ్యాన్స్ నేర్చుకుంటుంది సితార. అయితే తాజాగా ప్రముఖ నటి సాయి పల్లవి చేసిన సారంగ దరియా పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది సితార. సారంగ దరియా పాటకు సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులేసి అదరగొట్టింది. అయితే ఇదే పాటకు సితార లంగావోణి ధరించి స్టెప్పులేసింది. దీనికి సంబందించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ డ్యాన్స్ సూపర్ గా చేశావని కొందరు, ఫ్యూచర్ హీరోయిన్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. తండ్రి బాటలో పయనించి వెండి తెరపై అలరిస్తుందో లేదో చూడాలంటే కొన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే.