తెలుగు చిత్ర పరిశ్రమలో తన గాత్రంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సింగర్ సునీత. అటు సింగర్ కానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తన పంథాను కొనసాగిస్తోంది. ఎన్నో సుపర్ హిట్ సినిమాలకు పని చేసిన ఆమె ఇప్పటికీ 500 పైగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక ఇటు సింగర్గా కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న సింగర్గా వెలుగొందుతోంది సునీత.
అయితే ఇటీవల కాలంలో రామ్ విరపనేనితో బంధువుల సమక్షంలో రెండవ వివాహం కూడా చేసుకున్నారు. ఇక విషయానికొస్తే..గతంలో తను చేయని తప్పుకు ఎంతో బాధపడ్డానని కొన్ని విషయాలను పంచుకుంది ఈ సింగర్. ఒకానొక సమయంలో ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వద్ద పాట పాడటానికి వెళ్లాను. అప్పుడు అతడు తన చేతిలో ఉన్న మైకు ఇచ్చి పాడమన్నాడు. నేను ఆ మైక్ తీసుకుని పాడాను.
ఇక పాడిన అనంతరం బయటకు వస్తుండటంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య మైక్ తీసుకునేటప్పుడు ఆయన వేలు ఎందుకు ముట్టుకున్నావని అసహ్యంగా అడిగింది. దీంతో అప్పుడు ఆమెకు నేను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి ఇంటికి వచ్చాను. కానీ ఆ ఘటన తర్వాత రాత్రంతా ఎంతో బాధ పడుతూ ఏడ్చాను అని తెలిపింది సునీత.