సింగర్ పార్వతి.. తన పాటతోనే కాకుండా- తన వ్యక్తిత్వంతో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. సెలబ్రిటీల మొదలు సామాన్యుల వరకు అందరూ సింగర్ పార్వతిని అభిమానించారు. తన పాటతో ఊరికి బస్సు తెచ్చి.. ఆ గ్రామం కల నెరవేర్చిందని తెలుసుకుని అంతా శభాష్ పార్వతీ అంటూ జేజేలు పలికారు. అలా పాటతో వచ్చిన పేరు- ప్రఖ్యాతలే చివరకి ఆ పాటకు ఆమె దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చాయి. సన్మానాలు, ఇంటర్వ్యూలు, ఫోన్ కాల్స్ ఇలా ప్రాక్టీస్ చేయడానికి కూడా తీరిక లేకుండా గడిపిన పార్వతి.. చివరికి షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఆ సమయంలో పార్వతి అభిమానులు ఎంతో బాధ పడ్డారు.
అయితే జడ్జెస్ కూడా సింగర్ పార్వతీ వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇవ్వాలంటూ ఆకాంక్షించారు. అలా అభిమానులు, ప్రేక్షుకులు, న్యాయనిర్ణేతల కోరిక, పార్వతీ టాలెంట్ రెండూ కలిపి తిరిగి ఆమె షోలో ఎంట్రీ ఇచ్చింది. సింగర్ పార్వతి సరిగమప సింగింగ్ రియాలిటీ షోలోకి తిరిగి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. దాని కుడీ భుజం మీద కడవ అంటూ సింగర్ పార్వతి తన గాత్రంతో కట్టిపడేసింది.
ఇదీ చదవండి: కామెడీ షోలో హీరోయిన్ హెబ్బా పటేల్ రచ్చ! ఎవరినీ వదల్లేదు..అంతేకాకుండా షోలో ఉన్న సింగర్స్, తోటి పార్టిసిపెంట్స్, న్యాయనిర్ణేతలకు తమ పొలంలో పండిన వేరు శనగకాయుల, మామిడి కాయలు, వాళ్ల పొలంలో పండించిన ధాన్యంతో పాయసం చేసి తీసుకొచ్చింది. పార్వతి అభిమానం చూసి అంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ పార్వతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.