తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో అతి కొద్దిమంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. ఈ క్రమంలో రాజశేఖర్, జీవిత దంపతుల కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా సీనీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దొరసాని చిత్రంతో శివాత్మిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి..కానీ మూవీ సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది శివాత్మిక.
సినీ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శివాత్మక ‘పంచతంత్రం’ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు నటి జీవిత, డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా శివాత్మిక మాట్లాడుతూ.. ఈ మూవీ డైరెక్టర్ హర్ష నాకు కథ చెప్పిన విధానం ఎంతో ఆకట్టుకుంది.. ఆ క్షణమే ఈ మూవీలో నటించాలని నిర్ణయించుకున్నాను.. ఇక అఖిలేష్ ఈ మూవీ మీకోసమే చేశాను.. మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్స్.. అలాగే ఈ మూవీలో నటించడానికి మరో కారణం ఉష ఆమెకు కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
ఈ మూవీలో నేను లేఖ పాత్రలో నటించాను.. అది అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నా కెరీర్ లో బ్రహ్మానందం, స్వాతి రెడ్డి లాంటి మంచి నటులతో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగ్ సమయంలో అందరూ నాకు ఎంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు.. ఇంత మంచి ఫ్రెండ్స్ అందించిన రాజ్ కి థ్యాంక్స్.. ఈ మూవీ కోసం అందరం కష్టపడి పనిచేశాం.. మా అందరికీ మంచి సక్సెస్ రావాలి’ అంటూ ఎమోషన్ కి గురై కన్నీరు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ‘పంచతంత్రం’ మూవీకి సృజన్-అఖిలేష్ నిర్మాతలుగా వ్యవహరించారు. కలర్స్ స్వాతిరెడ్డి, శివాత్మిక, నరేష్, బ్రహ్మానందం, సముద్రఖని, రాహూల్ విజయ్, దివ్య శ్రీపాద ముఖ్య భూమిక పోషించారు. ఈ మూవీ ఐదు విభిన్న కథాంశాలతో రూపొందినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేక్షకులు ఈ మూవీ చూస్తున్నంతసేపు ఐదు సినిమాలు చూసినంత అనుభూతి కలుగుతుందని అన్నారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.