బుల్లితెరపై పలు సీరియల్లో నటించి తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి రీసెంట్ గా తన సీమంతం వేడుకతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపూతూ స్పందిస్తున్నారు.
సినిమా రంగంలోనైనా, టివి రంగంలోనైనా నటీ నటులు వారి వ్యక్తిగత విషయాల పట్ల కాస్త గోప్యత వహిస్తారు. అది లవ్ అయినా పెళ్లికి సంబంధించిన విషయమైనా కొంతకాలం బయటపడకుండా దాచేస్తారు. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారానో లేదా ఇతర వేదికల ద్వారా ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరుస్తారు. ఇదే విధంగా త్వరలో తల్లి కానున్న ఓ బుల్లి తెర నటి తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. దీంతో అభమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సీరియల్ నటిగా ప్రేక్షకుల ఆధరణ పొందిన నటి లహరి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టివి సీరియల్స్ లో నటిస్తూ అప్పుడప్పుడు వెండితెరపై కూడా అలరించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో లహరికి అవకాశం రావడంతో అందులో నటించి మెప్పించింది. ముద్దు బిడ్డ, చక్రవాకం, మొగలి రేకులు, ఇంటింటి గృహలక్ష్మీ వంటి సీరియల్స్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ లో కూడా సొంతంగా ఓ ఛానల్ ను క్రియేట్ చేసుకుని తనకు సంబంధించిన ఫొటోలను వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది.
లహరి వివిధ రకాల వ్లాగ్స్ చేస్తూ, ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సుమారు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. పెళ్లైన తరువాత నటనకు కాస్త విరామం ఇచ్చింది. ప్రస్తుతం లహరి గర్భిణీ. త్వరలో తల్లి కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు లహరికి సీమంతం నిర్వహించారు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులతో పాటు పలువురు నటులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.