రాకేష్ మాస్టర్ మరణవార్త తెలియగానే కొందరు సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు. ఈ విషయం తెలియడంతో ఆయన శిష్యుడైన శేఖర్ మాస్టర్ సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. రాకేష్ మాస్టర్ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ మరణవార్త తెలుసుకుని ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు వెంటనే అతని ఇంటికి చేరుకుని బోరున విలపించారు. కొందరు సినీ ప్రముఖులు సైతం ఆయన పార్థివదేహాన్ని చూసి సంతాపం తెలిజేయజేశారు.ఆయన అభిమానులు సైతం సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.., రాకేష్ మాస్టర్ మధ్య శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, రాకేష్ మాస్టర్ చనిపోవడంతో ఆయన కడసారి చూపుకోసమైన శేఖర్ మాస్టర్ వెళతాడా లేదా అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా శేఖర్ మాస్టర్ తన గురువు మరణవార్త తెలియగానే సోమవారం నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. రాకేష్ మాస్టర్ పార్థివదేహాన్ని చూసి శేఖర్ మాస్టర్ కన్నీరు పెట్టారు. అనంతరం ఆయన పార్థివదేహానికి నమస్కారం చేశారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ మరో శిష్యుడైన జానీ మాస్టర్ కూడా ఆయన కడసారి చూపు కోసం వెళ్లారు. ఇక నగరం నలుమూలల్లో ఉన్న రాకేష్ మాస్టర్ అభిమానులు ఆయన చివరి చూపుకోసం ఇంటికి వెళ్తున్నారు.