సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. కాగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకి పవర్స్టార్ పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో… పవర్స్టార్ పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్కు రాలేదు. తన మొదటి సినిమా సమయంలో వచ్చానని అనుకుంటున్నాను. దానికి కారణం.. ఇంట్లో మా అక్కయ్య కొడుకుగా తనను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. . గోకులంలో సీత సినిమా విషయానికి వచ్చేసరికి అన్నయ్య సపోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వచ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణవ్ కానీ.. ఎవరైనా కుటుంబంపై ఆధాపపడకూడదు. కష్టమో, నష్టమో..సొంతంగా జర్నీ చేయాలి. కానీ ఈరోజు ఫంక్షన్కు రావడానికి కారణం, నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా రిలీజ్ టైమ్లో అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్కు గురికావడమనేది చాలా బాధాకరమైన విషయం. హీరో ఫంక్షన్లో లేని లోటు తెలియనీయకుండా మనవంతు ఏదో చేయాలని నేనిక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి తేజు. సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలి.
ఇక ఈ మధ్య కాలంలో నేను ఫీలైందేంటంటే.. తేజ్కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు దర్శకులు, నిర్మాతలు, మిత్రులు, పెద్దలు వచ్చి కోలుకోవాలని ప్రార్థించారు. కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను. తేజ్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది.. చాలా స్పీడుతో నడుపుతున్నాడు.. నిర్లక్ష్యంతో నడుపుతున్నాడు.. కథలు వచ్చాయి. ఆటోను దాటించేటప్పుడు ఎంత స్పీడులో వెళతాడు నలబై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉండొచ్చు. ఇసుక ఉండటం వల్ల పడిపోయాడు. జాలిపడాలి మనం. దాని మీద కథనాలు అల్లి, మాట్లాడితే ఎలా? అలాంటి వ్యక్తులకు నా విన్నపం ఏంటంటే.. కొంచెం కనికరం చూపించండి. మేమూ మనుషులమే కదా! ఇలాంటి పరిస్థితి మీకు రాదని గ్యారంటీ ఏంటి? మీకు కూడా వస్తుంది కదా. దయచేసి కొంత కనికరం చూపించండి. దేవకట్టాగారు చేసిన ప్రస్థానం సినిమా చూశాను. చాలా చక్కటి సినిమా. ఆటోనగర్ సూర్య చేసినప్పుడు ఆ నిర్మాతలు కలిసి చాలా చక్కటి దర్శకుడు అని చెబుతుండేవారు. రిపబ్లిక్ సినిమాను కూడా సామాజిక స్పృహతో చేశారు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది. మన ప్రాథమిక హక్కులేంటి? అనే దానిపై మాట్లాడే సినిమా అని అర్థమవుతుంది. జైహింద్ అని నేను ప్రతి సభలో చెబతుంటాను. ఓ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మాగాంధీజీ వంటి వేలకొలది మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే కానీ, భారత దేశం గణతంత్య్ర దేశంగా ఆవిర్భవించలేదు. అంత గొప్ప త్యాగాలకు గుర్తు అని పవన్ తెలిపారు.
హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘అన్నయ్య తేజు బాగా కోలుకుంటున్నాడు. అందరినీ అలరించడానికి త్వరగా వచ్చేస్తాడు. ఆరోజు ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో ఉండి త్వరగా ఫోన్ చేసి అన్నయ్యను హాస్పిటల్లో చేర్చిన వారికి చాలా థాంక్స్. డాక్టర్స్తో పాటు అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదంతో తేజన్నయ్య త్వరగా కోలుకుంటున్నాడు. మీకు థాంక్స్ అని చెబితే సరిపోదు. రిపబ్లిక్ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాను థియేటర్స్లో చూడాలని అనుకుంటున్నాను. అందరూ హెల్మెట్ ధరించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఓ అన్నయ్యలా, తమ్ముడిలా, కొడుకులా చెబుతున్నాను. ప్లీజ్.. రిపబ్లిక్ టీమ్కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.