తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీ భారీ అంచనాల మధ్య రేపు రిలీజ్ అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ తో కాకుండా సొంత టాలెంట్ తో ప్రేక్షకుల మనసు దోచారు. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు నటన, డ్యాన్స్, ఫైట్స్ తో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజా పక్షాన పోరాడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ మంచి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఒకే ఫ్రేమ్ లో మెగా హీరోలను చూడాలని తెగ ఆశపడుతుంటారు. ఇటీవల ఆచార్య మూవీతో చిరంజీవి, రామ్ చరణ్ లు కనిపించారు. ప్రస్తుతం బ్రో మూవీలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కి భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా అభిమానుల జాగ్రత్తగా ఉండాలని సుప్రీం హీరో విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’మూవీ భారీ అంచనాలతో రేపు శుక్రవారం, 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని అధికారులు అంటున్నారు. వర్షాలు లేకుంటే ఇప్పటికే థియేటర్ల వద్ద మెగా అభిమానులు ధూం.. దాం.. చేస్తూ తెగ సందడి చేసి ఉండేవారు. తెలంగాణలో పది రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండండి అంటూ ఎంతో బాధ్యాతాయుతంగా సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు ఓ విన్నపం చేశారు. దీనికి సంబంధించి ఓ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘ప్రియమైన అభిమానులు, నా శ్రేయోభిలాషులు.. ఇప్పటి వరకు మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. మీ అభిమానానికి ఎల్లపుడు రుణపడి ఉంటాను. సముద్రఖని దర్శకత్వంలో నేనూ.. కళ్యాణ్ మామయ్య కలిసి నటించిన సినిమా ‘బ్రో’ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఆసక్తి కనబరిచి విడుదలకు ముందు బ్యానర్లు, కటౌట్స్లతో ఒక పండుగ వాతావరణం తీసుకు వచ్చారు. మీరు ఇష్టంగా చాటుకుంటున్న అభిమానాన్ని మేం కాదనలేదు. బ్యానర్లు, కటౌట్లను కట్టాలనుకుంటే జాగ్రత్తగా, బాధ్యతగా ఉండండి. మా సినిమాల కన్నా మీ భద్రతే మాకు చాలా ముఖ్యం. వేడుకల ఉత్సాహంలో అభిమానులకు ఎలాంటి హాని జరుగుతుందో అన్న ఆలోచన నేను భరించలేను. అభిమానులు తమ కుటుంబాలకు విలువైనవారు కాబట్టి, ఎన్నో ఆశలు ఉంటాయి.. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ లేఖ పేర్కొన్నారు సాయి ధరమ్ తేజ్. తాజాగా తేజ్ రిలీజ్ చేసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ ప్రేమకి చాలా చాలా థాంక్స్!!!
దయచేసి జాగ్రతగా ఉండండి.#BroTheAvatar pic.twitter.com/yVb1x9ujNQ— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023