సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఏ వార్త ఫ్యాక్ట్, ఏది ఫేక్ అనేది తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ గురించి అయితే చెప్పక్కర్లేదు.
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఏ వార్త ఫ్యాక్ట్, ఏది ఫేక్ అనేది తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. స్వయంగా సినీ ప్రముఖులు రంగంలోకి దిగి వివరణ ఇస్తేనే కానీ వాస్తవాలు వెలుగులోకి రావట్లేదు. ఇదిలా ఉంటే, ఇటీవల సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే మాట విపరీతంగా వినిపిస్తుంది. తమిళ్ స్టార్ ధనుష్ – ఐశ్యర్య కపుల్ విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తర్వాత కొద్ది రోజులకి విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటి గురించి ధునుష్ – ఐశ్వర్య ఇద్దరిలో ఎవరూ రియాక్ట్ కాలేదు. దీంతో ఇక వీరు కలవడం కష్టమనుకుని సైలెంట్ అయిపోయారు ఫ్యాన్స్. ప్రస్తుతం ‘లాల్ సలాం’ అనే ఓ కోలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారామె. రజినీ కీలక పాత్రలో కనిపించనున్నారు.
కట్ చేస్తే.. ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త వైరల్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే.. ఈమధ్య ఓ తమిళ్ హీరోతో ఎక్కువగా కనిపిస్తుందట. చెన్నైలోని ఓ రిసార్ట్లో ఆ హీరోతో ఐశ్వర్య సన్నిహితంగా ఉండండంతో సెకండ్ మ్యారేజ్ న్యూస్ వైరల్ అవుతుంది. దీని గురించి క్లారిటీ రావాలంటే ఐశ్వర్య స్పందించాలని, లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్ దెబ్బతింటుందనేది అభిమానుల ఆకాంక్ష. ఇటీవల ధనుష్, కుమారులు యాత్ర – లింగ ఇద్దరితో తిరుపతి వచ్చారు. హీరోగా 50వ సినిమా మైలురాయిని చేరుకోవడం, తానే దర్శకత్వం వహిస్తుండడంతో.. పాత్ర కోసం గుండు చేయించుకోవడానికి తిరుమల వచ్చారాయన.
విడిపోవడానికి కారణం ఇదేనా?..
ధనుష్ – ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఏంటనేది తెలియదు. విడిపోతున్న విషయాన్ని మొదట ఐశ్వర్య, తర్వాత ధనుష్ ప్రకటించారు. సుచీ లీక్స్లో ధనుష్ పిక్స్ బయటకు వచ్చినప్పటి నుంచే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. తర్వాత కూడా ధనుష్ ఓ హీరోయిన్తో క్లోజ్గా ఉండడం ఐశ్వర్యకు నచ్చలేదని, అందుకే విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారని టాక్. ధనుష్ ఎఫైర్స్ విషయంలో చాలా కాలం మౌనంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమీ లేక విడిపోవాలని నిర్ణయించుకున్నారని తమిళ్ సినీ వర్గాల వారు అంటున్నారు.
స్పందించిన ఐశ్యర్య రజినీ కాంత్..
కాగా తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా, సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ కావడంతో.. ఐశ్యర్య రజినీ కాంత్ స్పందించారని తెలుస్తుంది. దీని గురించి సన్నిహిత మీడియా వర్గాల వారితో మాట్లాడుతూ.. అదంతా ఫాల్స్ న్యూస్, మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారని సమాచారం.