సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం.. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన తారలుగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అయింది.
విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన RRR.. భారీ బడ్జెట్ తో రూపొందిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్స్ వద్ద మాస్ జాతర జరుపుతున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. తెల్లవారుజాము నుండే షోలు పడటంతో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ లో అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని కనిపించడం విశేషం.
ఇది చదవండి: RRR మూవీ రివ్యూ!
ప్రస్తుతం అందరి చూపు ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పై పడింది. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఊహించని రేంజిలో జరుపుకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు 220 కోట్ల నుండి 250 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ తో పాటు అన్ని భాషలు, అన్ని ఏరియాలు కలిపి ఈజీగా వసూల్ చేస్తుందని అంటున్నాయి. టిక్కెట్ ధరల పెంపుదల, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మార్కెట్ లో బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా మొత్తం షేర్ లో 40% ఏపీ, తెలంగాణలోనే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.