మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ కొణిదెల, పాపులర్ యాక్ట్రెస్ రాశీల మధ్య కూడా మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.
చిత్ర పరిశ్రమలో తెరమీద కనిపించే వారికే కాదు. తెరవెనుక ఉండే వారికి కూడా మంచి స్నేహబంధం ఉంటుంది. స్టార్ హీరోల భార్యలు, పిల్లలు చాలా మంది ఆఫ్ స్క్రీన్ మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తుంటారు. బ్లాక్ వైడ్ రోజుల నుండి ఇప్పటి యంగ్ స్టర్స్ వరకు ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తున్న వారెందరో ఉన్నారు. ఇక హీరోల ఫ్యామిలీల మధ్య కూడా చక్కటి బాండింగ్ ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రతల గారాల పట్టీ సితార ఘట్టమనేని, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వారి పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే వారి భార్యలు ఉపాసన కొణిదెల, లక్ష్మీ ప్రణతి కూడా ఫ్రెండ్స్. వారి బర్త్డే సెలబ్రేషన్స్ కలిసి జరుపుకున్న పిక్స్, వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. RRR మూవీలో కలిసి నటించిన తర్వాత వీరి రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయింది. అలాగే అల్లు అర్జున్, తారక్ కూడా స్నేహితులే. శర్వానంద్, రామ్ చరణ్ కూడా గుడ్ ఫ్రెండ్స్. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ కొణిదెల, పాపులర్ యాక్ట్రెస్ రాశీల మధ్య కూడా మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రాశీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాశీ.. టీనేజ్లోకి ఎంటర్ అవగానే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యింది. సీనియర్ మరియు యంగ్ హీరోల పక్కన పలు చిత్రాల్లో ఆడి పాడి అలరించింది. అంతేకాదు, తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కథానాయికగానే కాకుండా ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. స్పెషల్ సాంగ్స్, ‘నిజం’ లో చేసిన నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ని షాక్ గురి చేశాయి. కెరీర్ పీక్స్లో ఉండగానే అసిస్టెంట్ డైరెక్టర్ (తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు)ను వివాహం చేసుకున్న రాశీ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. వీరికి ఓ పాప ఉంది. కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రాశీ సినిమాలతో పాటు ‘గిరిజా కళ్యాణం’, ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ఇక చిరు సతీమణి సురేఖతో రాశీకి ఉన్న అనుబంధం గురించి సమాచారం ఇలా ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడు అయితే బాగుంటుందని తనను ప్రోత్సహించారు సురేఖ గారు. ఈ విషయం పవన్ చాలా సార్లు చెప్పారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో పీకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పవన్ రెండో సినిమా ‘గోకులంలో సీత’ సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రాశీ హీరోయిన్. మంచి విజయం సాధించిందీ చిత్రం. అయితే కథానాయికగా రాశీ పేరుని దర్శకుడికి రిఫర్ చేసింది ఎవరో కాదు సురేఖ గారే. రాశీ ఫ్యామిలీ అప్పట్లో చెన్నైలో ఉండేవారు. ఓరోజు అనుకోకుండా రాశీ తండ్రిని కలిసిన సురేఖ వారింట్లో రాశీ ఫోటోలను చూసి ఫిదా అయిపోయారట. ‘గోకులంలో సీత’లో పవన్ పక్కన బాగుంటుందని చిరుకి చెప్పడంతో రాశీని ఫిక్స్ చేశారట. అంతకుముందు తెలుగుతో పాటు తమిళంలోనూ బాలనటిగా యాక్ట్ చేసిన రాశీ అప్పటికే ‘పెళ్లిపందిరి’ చేసి ఆకట్టుకుంది. పవన్ సినిమాలో రాశీకి వేషం ఇప్పించిన సురేఖతో అప్పటినుండి రాశీ రిలేషన్ కొనసాగుతోంది.