పుష్ప సినిమా విజయంతో ఫుల్ జోష్లో ఉంది హీరోయిన్ రష్మిక మందన్న. అంతేకాదు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది అమ్ముడు. ముఖ్యంగా ఈ భామ, విజయ్ దేవరకొండతో కలిసి ముంబైలో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఆమె అభిమానాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక మంగళవారం ఇన్ స్టాలో తన చేయి ఫోటోని షేర్ చేశారు. దీనిలో ఆమె చేతికి అక్కడక్కడ గాయాలయినట్లు గుర్తులు ఉన్నాయి. ఈ ఫోటోతో పాటు రష్మిక ‘మీలో ఎవరైనా సినిమాను కెరీర్ గా ఎంచుకుందామనుకుంటున్నారా.. ఇక్కడ అంతా బ్రహ్మండంగా.. అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారా.. స్టార్ డమ్, డబ్బు బాగా సంపాదించవచ్చనే ఆలోచనలో ఉన్నారా.. మీరు అనుకునేదంతా కరెక్టే. కానీ ఇక్కడ అన్ని అద్బుతాలు మాత్రమే కాదు.. ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి’.
‘హీరోయిన్ అయిన కారణంగా నేను ఇప్పటికే ఎన్నోసార్లు లేజర్ చేయించుకున్నాను. ఇది ఎంత బాధకరమో మాటల్లో చెప్పలేం.. లేజర్ ఫలితమే నా చేతి మీద ఉన్న ఈ గాయాలు’ అనే క్యాప్షన్తో ఈ ఫోటోని షేర్ చేశారు రష్మిక. ఇది చూసిన ఫ్యాన్స్ పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.