బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ఏకంగా 10 వేల ఆదిపురుష్ టిక్కెట్లను కొననున్నారు. వీటిని ఎందుకు కొన్నారో తెలిస్తే.. ఆయన గొప్ప మనసుకు సెల్యూట్ చేయక మానరు.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ‘‘ఆదిపురుష్’’ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ఈ సినిమా విడుదల సందర్భంగా తన గొప్ప మనసు చాటుకోనున్నారు. పేద పిల్లల కోసం ఎవ్వరూ చేయని గొప్ప పని చేయనున్నారు. ఇంతకీ ఏంటా గొప్పపని అంటే.. రన్బీర్ కపూర్ 10వేల ఆదిపురుష్ టిక్కెట్లను కొననున్నారు. ఈ టిక్కెట్లను దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 10 వేల మంది పేద పిల్లలకు పంచనున్నారు. ఆ టిక్కెట్లతో ఆ పేద పిల్లలు ఉచితంగా సినిమా చూడనున్నారు.
ఈ మేరకు అఫిషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. దీనిపై ప్రముఖ సినిమా అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ ఎక్స్క్లూజివ్.. రన్బీర్ కపూర్ 10000 వేల ఆదిపురుష్ సినిమా టిక్కెట్లు బుక్ చేయనున్నారు. వాటిని నిరుపేద పిల్లలకు పంచనున్నారు. ఇది ఇందుకు సంబంధించిన పోస్టర్’’ అంటూ ఓ పోస్టర్ను కూడా షేర్ చేశాడు. కాగా, ఆదిపురుష్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమాలో సీతగా కృతిసనన్ కనిపించనున్నారు.
ఓం రౌవత్ ఆదిపురుష్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక, ఈ సినిమా బాహుబలిని మించిన హిట్టు కానుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. మరి, పేద పిల్లల కోసం రన్బీర్ కపూర్ 10వేల టిక్కెట్లు కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Xclusiv… RANBIR KAPOOR TO BOOK 10,000 TICKETS OF ‘ADIPURUSH’ FOR UNDERPRIVILEGED CHILDREN… OFFICIAL POSTER…#RanbirKapoor #Adipurush #Prabhas #KritiSanon #SaifAliKhan #SunnySingh #DevdattaNage pic.twitter.com/k30OUNvO9G
— taran adarsh (@taran_adarsh) June 8, 2023