రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు. రామ్ చరణ్ తండ్రిని అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను చెర్రీ కూడా తండ్రిలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్థత్వం అని మరోసారి రుజువు చేశాడు. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న తర్వాత.. “నటనలో చిరు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను.. ఈ ట్రూ లెజెండ్ అవార్డు ఆయనకే అంకితం చేస్తున్నాను” అంటూ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నటనలోనే కాదు.. వ్యక్తిత్వంలో కూడా రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడంటూ కొనియాడుతున్నారు.
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఎన్డీటీవీ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా పేరిట ఆదివారం అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో రామ్ చరణ్కు ట్రూ లెజెండ్ అవార్డు దక్కింది. చెర్రీకి ఈ అవార్డు రావడంపై మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. “నాన్నా.. నీకు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు రావడంపై ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఇంకా నువ్వు సాధించాల్సింది చాలా ఉంది-అమ్మానాన్న” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఆ మెసేజ్కు రామ్ చరణ్ లవ్ యూ నాన్న అంటూ రిప్లై ఇచ్చాడు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పుకొచ్చాడు. “ఏ కథ అయినా ఓ వ్యక్తిగత అనుభవం నుంచే మొదలవుతుంది. 1998లో మా కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తి ఆపరేషన్ సమయంలో బ్లడ్ అందక చనిపోయారు. 20వ శతాబ్దంలో రక్తం దొరక్క మనిషి చనిపోవడం మమ్మల్ని షాక్కు గురిచేసింది. అప్పటి నుంచే నాన్న బ్లడ్ బ్యాంక్ సేవలు ప్రారంభించారు. ఆయన అభిమానులకు రక్తదానం చేయడిం నాతో ఫొటో దిగండి అంటూ పిలుపునిచ్చారు. అలా మొదలైన బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోంది” అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి బాధ నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ పుట్టుకొచ్చిందని చాలా మందికి తెలియదు.
Nanna,
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend – #FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest @AlwaysRamcharan– Appa & Amma pic.twitter.com/6t1wJuvzxy
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 2, 2022