రాకేష్ మాస్టర్ మూడో భార్యపై కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి నడి రోడ్డుపై జుట్టుపట్టుకుని కిందపడేసి చితక బాదారు. యూట్యూబ్ చానల్ విషయంలో తలెత్తిన వివాదవే ఈ దాడికి కారణం అని తెలుస్తోంది. కాగా దాడికి గురైన లక్ష్మీ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను చంపడానికి పథకం వేస్తున్నారని తెలిపింది.
ఇటీవల కన్నుమూసిన రాకేష్ మాస్టర్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ గా కొన్ని వందల పాటలకు కొరియోగ్రఫి చేశారు. ఆ తరువాత ఓ ఛానల్ వచ్చిన ఢీ డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. తన వద్ద ఉన్న ప్రతిభతో ఎంతో మంది డ్యాన్సర్లను తయారు చేశాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లు రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన వారే. కాగా కొన్ని పరిస్థితుల వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమయ్యాడు రాకేష్ మాస్టర్. ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ వద్ద వంట పని చేయడానికి వచ్చిన లక్ష్మీ అనే మహిళను తన మూడో భార్యగా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె పై నిన్న (శుక్రవారం) సాయంత్రం లల్లీ అనే యూట్యూబర్, మరో నలుగురు మహిళలు కలిసి దాడి చేశారు. ఈ దాడిపై లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుపారీ ఇచ్చి తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నరని తెలిపింది. ఆ వివరాలు మీకోసం..
రాకేష్ మాస్టర్ మూడో భార్యగా పరిచయమైన లక్ష్మి ఓ యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తోంది. అయితే నిన్న సాయంత్రం స్కూటీపై వెళ్తున్న లక్ష్మిని పంజాగుట్ట ప్రాంతంలో కొందరు మహిళలు అడ్డగించి చితక బాదారు. యూట్యూబర్ లల్లీ, మరో నలుగురు మహిళలు ఆమెపై దాడిచేసారు. జుట్టు పట్టుకుని కిందపడేసి చితక్కొట్టారు. అయితే ఈ ఘటనపై రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మి మాట్లాడుతూ.. నన్న చంపేందుకు రెండు నెలల నుంచి పథకం వేస్తున్నారు. దానిలో భాగంగానే తనపై దాడి జరిగిందని తెలిపింది. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ లక్ష రూపాయల సుపారీ ఇచ్చి తనపై దాడి చేయించిందని ఆరోపణలు చేసింది. తనను యూట్యూబ్ నిర్వహించొద్దంటూ బెదిరిస్తున్నారని, యూట్యూబ్ విడిచి వెళ్లాలని హెచ్చరిస్తున్నారని లక్ష్మి తెలిపింది. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను లక్ష్మి కోరింది. కాగా నిన్న దాడి జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది లక్ష్మి. మరోవైపు యూట్యూబర్ లల్లీ కూడా లక్ష్మీపై కంప్లైంట్ చేసింది. ఇరువురి నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వారిని స్టేషన్ నుంచి పంపించేశారు.