ఇటీవల కన్నుమూసిన రాకేష్ మాస్టర్ భార్యపై కొంత మంది మహిళా యూట్యూబర్లు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టారు. వీరిద్దరి మధ్య తలెత్తిన ఆ వివాదం కారణంగానే దాడి జరిగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల పాటలకు కొరియోగ్రఫి చేసి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. తన టాలెంట్ తో ఎంతో మందికి డ్యాన్స్ నేర్పించాడు. ఇప్పుడున్నచాలామంది డ్యాన్సర్లకు గురువయ్యాడు. రాకేష్ మాస్టర్ వద్ద డ్యాన్స్ నేర్చుకున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లు ఇండస్ట్రీలో తిరుగులేని కొరియోగ్రాఫర్ లుగా రాణిస్తున్నారు. కాగా రాకేష్ మాస్టర్ తన వద్దకు వంట చేయడానికి వచ్చిన లక్ష్మీ ని తన భార్యగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆమెతో రిలేషన్లో ఉన్నట్లు గతంలో పలు వీడియోల్లో చెప్పారు. అయితే తాజాగా లక్ష్మీ పై దాడి జరిగింది. కొంత మంది యూట్యూబర్లు లక్ష్మీ పై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల కన్నుమూసిన రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మీపై నగరంలోని పంజాగుట్ట ఏరియాలో కొందరు మహిళా యూట్యూబర్లు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెల్తున్న లక్ష్మీని అడ్డుకుని లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టారు. విషయం పోలీసులకు చేరడంతో వీరిరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూట్యూబ్ విషయంలో వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. దాడికి దిగిన లల్లీ యూట్యూబ్ లో స్పందిస్తూ మైనర్ అయిన తన కూతురుపై లక్ష్మీ అసభ్యంగా మాట్లాడిందని ఆరోపించింది. మరోవైపు లక్ష్మీ మాట్లాడుతూ తనను యూట్యూబ్ విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నారని, తనను అంతమొందించాలని చూస్తున్నారని, దానిలో భాగంగానే తనపై దాడికి పాల్పడ్డారని తెలిపింది. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఇద్దరి నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు స్టేషన్ నుంచి వారిని పంపించేశారు.