ఆయన శిష్యులు శేఖర్, సత్య, గణేష్ మాస్టర్లతో పాటు డ్యాన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటైంది. ఈ సంతాప సభలో పలువురు సినీ ప్రముఖులు, డాన్స్ మాస్టర్లు, డాన్సర్స్, రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు
ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈ నెల 18న అనారోగ్యం కారణంగా మరణించారు. రక్తపు విరేచనాలు, వాంతుల కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. మరుసటి రోజు బోరబండలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి శిష్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక, ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్లో రాకేష్ మాస్టర్ సంతాప సభ జరిగింది.
ఆయన శిష్యులు శేఖర్, సత్య, గణేష్ మాస్టర్లతో పాటు డ్యాన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటైంది. ఈ సంతాప సభలో పలువురు సినీ ప్రముఖులు, డాన్స్ మాస్టర్లు, డాన్సర్స్, రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ మామ మాట్లాడుతూ.. ‘‘ రాకేష్ ఒక సంవత్సరం క్రితం నాకు ఒక ఖాళీ స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి నా దగ్గరకు తీసుకొచ్చాడు. దాన్ని నాకు ఇచ్చాడు. తనకు ఓ ఛానల్ ఉందని, ఆ ఛానల్ లో నాకు కూడా వాటా ఉందని అన్నాడు. ఒకవేళ తాను ముందు పోతే తన కుటుంబాన్ని నన్ను చూసుకోమన్నాడు. ఆ ఛానల్ వాటాను నన్ను తీసుకోమన్నాడు.
దీంట్లో నీకు ఎలా కావాలంటే అలా రాసుకో అంటూ ఆ పేపర్స్ ఇచ్చాడు. నాకు ఆస్తి అవసరం లేదు. అది మొత్తం వాళ్ళ పిల్లలకే ఇస్తాను. వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాను. నాకు అభిమానం చాలు. ఇంతమంది రాకేష్ మాస్టర్ని అభిమానిస్తున్నారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఆ పేపర్స్ను చించేశారు. మరి, రాకేష్ మాస్టర్ మామ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.