పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఇటీవల మేకర్స్ జనవరి 14న సంక్రాంతికి సినిమా రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే, దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. రాధేశ్యామ్ బృందం ఇప్పుడు సినిమాను వాయిదా వేసే ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. అసలే ఇది పాన్ ఇండియా చిత్రం.. దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి చూస్తుంటే.. ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్తో సహా అనేక రాష్ట్రాలు థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నాయి.
ఇలాంటి పరిస్థితిలో, రాధేశ్యామ్ విడుదల చేయడం రిస్క్అవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. T-సిరీస్ భూషణ్ కుమార్ ‘రాధేశ్యామ్’ విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ తో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి హిందీ మార్కెట్ కూడా చాలా కీలకమైనది. అందులోను పాన్ ఇండియా మూవీ కాబట్టి, థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకుండా ముందుకు వెళ్తే చిక్కుల్లో పడుతుంది. అయితే.. ఈ విషయం పై రాధేశ్యామ్ టీమ్ నుండి త్వరలో అధికారిక ప్రకటన రానుందట. RRR సినిమా వాయిదా పడిన తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. మరి రాధేశ్యామ్ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.