పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది.
1976 కాలంనాటి రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన రాధేశ్యామ్ మూవీ.. ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా రాధేశ్యామ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వెండితెర పై ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా కోసం పలు ఓటిటి సంస్థలు పోటీ పడుతుండగా.. అమెజాన్ ప్రైమ్ వారు భారీ ఒప్పందానికి ఓటిటి హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక కనీసం 4 వారాల తర్వాత ఓటిటిలో రిలీజ్ అవుతుంది. ఈ లెక్కన రాధేశ్యామ్ మూవీ ఏప్రిల్ 11న ఓటీటీ స్ట్రీమింగ్ కావాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం ఉండటంతో.. ఆరోజు నుండే రాధేశ్యామ్ మూవీని మధ్యాహ్నం 12 గంటల నుంచి స్ట్రీమింగ్ చేసేవిధంగా అమెజాన్ ప్రైమ్ వారు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. మరి రాధేశ్యామ్ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.