యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుత్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.’జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సుమారు 40 వేల మంది ఫ్యాన్స్ మధ్య చాలా గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాధా మాట్లాడుతూ.. ఈ సినిమా కథ లైన్ను 18 ఏళ్ల క్రితం తన గురువు దగ్గర తీసుకున్నట్లు.. అప్పటి నుంచి ఈ కథపై పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలోని టాప్మోస్ట్ రైటర్ల చేత ఈ కథను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ఫైట్లు ఉండవని ముందే ఓపెన్ అయిపోయారు. ప్రభాస్ మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి పక్కా లవ్స్టోరీని ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ను ఈవెంట్లో ఫ్యాన్స్ చేత రిలీజ్ చేయించారు. మరి ట్రైలర్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.