Priyanka Chopra: బాలీవుడ్తో సినిమా కెరీర్ను ప్రారంభించి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమంది హీరోయిన్లలో ప్రియాంక చోప్రా మొదటిస్థానంలో ఉంటారు. హాలీవుడ్ సింగర్తో పెళ్లి తర్వాత ప్రియాంక సినిమాలు తగ్గించేశారు. అరకొరగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అది కూడా ఇంగ్లీష్ సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘‘సైటెడెల్’’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. గత కొద్దిరోజుల నుంచి ప్రియాంక ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా.. అభిమానుల కోసం తప్పకుండా టైం స్పెండ్ చేస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికిప్పుడు తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.
తాజాగా, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ముఖంపై గాయాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోలను చూస్తున్న అభిమానులు షాక్ అవుతున్నారు. కొంతమంది ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. మరి కొంతమంది అది మేకపా?.. లేక నిజమా?.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. తాను షేర్ చేసిన గాయాల తాలూకూ ఫొటోల్లో కొన్ని నిజమైనవని మరికొన్ని మేకప్ ఎఫెక్ట్ అని క్లారిటీ ఇచ్చారు. సినిమా కోసం ప్రతీరోజు తాను ఎంత కష్టపడుతున్నానో ఆ ఫొటోల ద్వారా చెప్పకనే చెప్పుకొచ్చారు.కాగా, సరోగసి ద్వారా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వారికి కుమార్తె జన్మించింది. తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్టీ 100 రోజులకు పైగా హాస్పిటల్లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది.
ఇవి కూడా చదవండి : నవమాసాలు మోయకుండానే ‘అమ్మ’ అయ్యారు