డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ ‘లైగర్’. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం సినిమా థియోటర్లలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు.
‘లైగర్ పాన్ ఇండియా చిత్రం అయినప్పటికీ.. తెలుగులోనే ఫ్యాన్ బేస్ ఎక్కువుగా ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు రూ. 15 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ఓర్మాక్స్ మీడియా తెలిపింది. మిగిలిన రెస్ట్ అఫ్ ఇండియా రూ. 7.7 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా మొదటిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న లైగర్ రూ. 22.2 కోట్ల గ్రాస్ వసూలుచేసినట్లు సమాచారం. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 35 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రైలర్ తో అంచనాలు పెంచిన పూరీ, సినిమాను ఆ స్థాయిలో నిర్మించకపోవడమే మిక్స్డ్ టాక్ కు కారణమని చెప్తున్నారు. విజయ్కి ఇది బాలీవుడ్లో ఆరంగేట్ర చిత్రం కనుక రాబోవు రోజుల్లో మంచి విజయం సాధించాలని మనమూ ఆశిద్దాం.